‘నా రక్తంలోనే రాజకీయం ఉంది. నేను పుట్టింది రాజకీయ కుటుంబంలో కవిత ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చా.. జగిత్యాల అభివృద్ధి రేవంత్రెడ్డితోనే సాధ్యం అని భావించి కాంగ్రెస్ పార్టీలో చేరా’ అని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తొలిసారి ఎమ్మెల్యే సంజయ్ జగిత్యాల లో మీడియాతో మాట్లాడారు. జగిత్యాలలోని నూకపెల్లి డబుల్ బెడ్రూంలలో వసతుల కోసం రేవంత్ 32 కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పారు, ఇతర పార్టీల నుండి గెలిచిన వారు BRS హయాంలో మంత్రులు కాలేదా? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. జీవన్రెడ్డికి పీసీసీ సమాచారం ఇవ్వడంలో లోపం జరిగిందన్నారు ఎమ్మెల్యే సంజయ్.