వైజాగ్ స్టీల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం విధాన పరంగా నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీని వాస వర్మ అన్నారు. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రిగా తన ఛాంబర్లో సంతకం చేసి బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఏపీ బీజేపీ ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, అరమిల్లి రాధాకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, మాజీ మంత్రి పితాని సత్య నారాయణ, సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావుతోపాటు పలువురు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి తాను కృష్టి చేస్తానని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. ఎమ్మెల్యేలు సహకారంతో నరసాపురం పార్లమెంట్ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.
కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన భూపతిరాజు
0
208
Previous article
Latest Articles
వరంగల్ మేయర్ పీఠంపై బండి సంజయ్ ఫోకస్.. జీహెచ్ఎంసీలో ప్రచారం లేనట్టేనా?
హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -
- Advertisement -


