స్వతంత్ర, వెబ్ డెస్క్: మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గుంటూరులోని సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. మరికాసేపట్లో సీఎం జగన్ తో భేటీ కానున్నారు. పార్టీలో తనకు ప్రాధాన్యం దక్కక పోవడంపై అసంతృప్తి గా ఉన్న బాలినేని.. పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారు. తనకు వ్యతిరేఖంగా టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి పని చేస్తున్నారని భావిస్తున్నారు. ఈ క్రమంలో సుబ్బారెడ్డి పై సీఎం జగన్ కు ఫిర్యాదు చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే ప్రకాశం జిల్లా రాజకీయాలపై కూడా సీఎంతో చర్చించనున్నారు.


