Kerala Rape Case: దారుణం.. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం..!

స్వతంత్ర వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్‌ మైనర్ బాలిక ఉదంతం మరిచిపోక ముందే.. కేరళలో మరో చిన్నారి కామాంధుడి చేతుల్లో బలైపోయింది. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టిన దుండుగుడు.. అత్యంత అమానుషంగా వ్యవహరించాడు. హత్యకు ముందు నిందితుడు చిత్రహింసకు గురిచేసి, చిన్నారి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని ఓ గోనె సంచిలో కుక్కి డంపింగ్ యార్డ్లో పడేశాడు. కొచ్చిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. జీవనోపాధి కోసం బిహార్ నుంచి కేరళకు వలస వచ్చిన ఓ కుటుంబం.. కొచ్చి గ్యారేజ్ జంక్షన్కు సమీపంలో నివాసం ఉంటోంది.  శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో వారి ఐదేళ్ల పాప కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల గాలించినా పాప ఆచూకీ లభించకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. చిన్నారి కోసం గాలింపు చేపట్టారు. కుటుంబం ఉంటున్న ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించగా.. చిన్నారిని ఓ వ్యక్తి తన వెంట తీసుకెళ్తుండటం అందులో రికార్డయ్యింది. నిందితుడ్ని గుర్తించిన పోలీసులు.. అదే రోజు రాత్రి 9:30 గంటల ప్రాంతంలో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. కానీ చిన్నారి ఆచూకీ తెలియరాలేదు.

నిందితుడు మద్యం మత్తులో ఉండటంతో పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. నిందితుడు కూడా బిహార్ నుంచి ఓ వలస కూలీ కాగా.. ఆ చిన్నారి ఉంటున్న భవనం మొదటి అంతస్తులో అతడు కూడా నివాసముంటున్నాడని పోలీసులు చెప్పారు. ఫుల్లుగా మద్యం తాగి అపస్మారక స్థితిలో ఉండటం వల్ల అతడిని విచారించలేకపోయిన పోలీసులు.. చిన్నారి కోసం మార్కెట్ ప్రాంతాన్ని గాలించారు. చివరకు శనివారం ఉదయం చిన్నారిని తాను తీసుకెళ్లినట్టు అంగీకరించాడు. శనివారం ఉదయం వరకు చిన్నారి మృతదేహం ఆచూకీ లభ్యం కాలేదు. ఉదయం మార్కెట్లోని స్థానికులు పోలీసులకు ఫోన్ చేసి.. డంపింగ్ యార్డులో అనుమానాస్పదంగా ఉన్న గోనె సంచి కనిపించినట్టు చెప్పారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. చెత్త కుప్పలో ఉన్న గోనె సంచిని బయటకు తీసి తెరవగా చిన్నారి మృతదేహం కనిపించింది. అంతకు ముందు చిన్నారిని వెతకడం కోసం పోలీసులు.. స్థానిక ట్రేడ్ యూనియన్ సాయం తీసుకున్నారు.

‘శుక్రవారం రాత్రి నిందితుడు ఓ చిన్నారితో అటుగా వెళ్తుండటం చూశాను.. సాధారణంగా మార్కెట్ వెనుక్కి చాలా మంది మందు తాగడానికి వెళుతుంటారు. ఆ చిన్నారి తన బిడ్డ అని, మద్యం తాగడానికి వెళుతున్నానని, నిందితుడు నాకు చెప్పాడు. శనివారం ఉదయం నేను సీసీటీవీ ఫుటేజ్ చూసి, పోలీసులకు సమాచారం ఇచ్చాను,” అని ట్రేడ్ యూనియన్ వర్కర్ మీడియాకు తెలిపాడు.  చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అతి దారుణంగా అత్యాచారం చేసి, చిత్రహింసలకు గురిచేసి చంపేశాడని పోస్ట్‌మార్టంలో వెల్లడయ్యింది. ఈ ఘటనపై సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే, చిన్నారిని ప్రాణాలతో తల్లిదండ్రుల వద్దకు చేర్చలేకపోయామని ఆవేదన వ్యక్తం చేసిన పోలీసులు.. బాధిత కుటుంబానికి క్షమాపణలు చెప్పారు.

Latest Articles

టీడీపీలో దిద్దుబాటు చర్యలు?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భవిష్యత్ ప్రయాణంపై సరికొత్త విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. కేవలం సంక్షేమం, అభివృద్ధిని నమ్ముకుని అంతా సవ్యంగానే ఉందనుకుంటే మొదటికే మోసం వస్తుందన్న హెచ్చరికలు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్