ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) మరోసారి దేశంలోనే రిచెస్ట్ సీఎంగా నిలిచారు. దేశంలోని ముఖ్యమంత్రుల వ్యక్తిగత ఆస్తులు, క్రిమినల్ కేసులపై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్(ADR)అనే ఎన్జీవో సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది. 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది కోటీశ్వరులు ఉన్నట్లు ఈ సంస్థ తెలిపింది. ఈ నివేదిక ప్రకారం రూ.510.38కోట్లతో ఏపీ సీఎం జగన్(JAGAN) సంపన్న ముఖ్యమంత్రిగా మొదటి స్థానంలో నిలిచారు. ఇక పేద ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రూ.15లక్షల ఆస్తితో చివరి స్థానంలో ఉన్నారు.
అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ రూ.163 కోట్లు, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ రూ.63 కోట్లతో రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్(KCR) రూ.23కోట్లతో ఆరవ స్థానం సంపాదించారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేరళ సీఎం పినరయి విజయన్ కోటి రూపాయలకు పైగా ఆస్తులు కలిగి ఉన్నారు. ఇకపోతే క్రిమినల్ కేసుల్లో మాత్రం తెలంగాణ సీఎం కేసీఆర్ తొలి స్థానంలో నిలవగా.. ఏపీ సీఎం జగన్ మూడవ స్థానం సంపాదించారు. కాగా గతంలో ‘ది ప్రింట్’ ఇంగ్లీష్ వెబ్ సైట్ విడుదల చేసిన నివేదికలోనూ రిచెస్ట్ సీఎంగా జగన్(JAGAN) నిలిచిన సంగతి తెలిసిందే.
Analysis of Current Chief Ministers from 28 State Assemblies and 2 Union Territories of India 2023#ADRReport: https://t.co/fBRDTjV4RB#ChiefMinisters #ChiefMinister pic.twitter.com/rhcG8Q6HXr
— ADR India & MyNeta (@adrspeaks) April 12, 2023