Telangana |తెలంగాణలో దుకాణదారులకు గుడ్ న్యూస్ తెలిపింది రాష్ట్రప్రభుత్వం. రాష్ట్రంలో ఉన్నటువంటి దుకాణాలు, సంస్థలు ఇకపై 24 గంటలూ తెరిచి ఉంచేందుకు కేసీఆర్ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ దుకాణాలు, సంస్థల చట్టం -1988 కింద నమోదైన సంస్థలన్నిటికీ ఈ నూతన వెసులుబాటు తక్షణం అమల్లోకి వస్తుంది. ఈ మేరకు కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణికుముదిని ఉత్తర్వులు జారీ చేశారు. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఐడీ కార్డులివ్వాలని… అలాగే వారాంతపు సెలవులు, వారానికి పనిగంటలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. దీనితో పాటుగా అదనపు సమయం పనిచేసినప్పుడు ఓవర్టైం వేతనాలివ్వాలని కార్మికశాఖ స్పష్టం చేసింది. 24/7 దుకాణాలు, సంస్థల్ని నిర్వహించేందుకు ఏడాదికి రూ.10 వేల ఫీజు చెల్లించాలని సూచించింది.
Read Also: నంది అవార్డులపై పోసాని సంచలన వ్యాఖ్యలు
Follow us on: Youtube, Instagram, Google News