28.7 C
Hyderabad
Thursday, May 14, 2026
spot_img

సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలు ధరలు ప్రకటన

తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందేభారత్ రైలు పట్టాలెక్కనుంది. సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే వందేభారత్ రైలును ప్రధాని మోదీ శనివారం ఉదయం జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైలు నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో మాత్రమే ఆగనుంది. సికింద్రాబాద్‌-తిరుపతి(20701) రైలు సికింద్రాబాద్‌లో ఉదయం 6గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 2.30గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఇక తిరుపతి-సికింద్రాబాద్‌(20702) రైలు తిరుపతిలో మధ్యాహ్నం 3.15గంటలకు బయల్దేరి రాత్రి 11.45గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోనుంది. మంగళవారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో ఈ రైలు తిరగనుంది. ఈ రైలు టికెట్ ధరలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

చైర్ కార్ ధరలు   

సికింద్రాబాద్-నల్గొండ:రూ.470, సికింద్రాబాద్-గుంటూరు:రూ.865, సికింద్రాబాద్-ఒంగోలు:రూ.1075, సికింద్రాబాద్-నెల్లూరు:రూ.1270,  సికింద్రాబాద్- తిరుపతి:రూ.1680గా ధర ఉంది.

ఎగ్జిక్యూటివ్‌ ఛార్జీల ధరలు

సికింద్రాబాద్-నల్గొండ:రూ.900, సికింద్రాబాద్-గుంటూరు:రూ.1620, సికింద్రాబాద్-ఒంగోలు:రూ.2045, సికింద్రాబాద్-నెల్లూరు:రూ.2455,  సికింద్రాబాద్-తిరుపతి:రూ.3080గా ధర ఉంది.

అయితే తిరుపతి నుంచి సికింద్రాబాద్ వచ్చేటప్పుడు రైలు ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నాయి.

Latest Articles

అక్కినేని అభిమానులకు.. ఇక పండగే..

అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య, అఖిల్.. షూటింగ్లో బిజీగా ఉన్నారు. క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే.. అఖిల్ సినిమా లెనిన్ పై క్లారిటీ వచ్చింది కానీ.. నాగార్జున,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్