హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్ లెవెల్ అధ్యక్షుల సమావేశంలో బండి సంజయ్ కీలక వాఖ్యలు చేశారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలను అక్కడి నాయకులు చూసుకుంటారని అన్నారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మీద దృష్టి పెడతానని చెప్పారు. బండి సంజయ్ ప్రచారం వల్ల 2020 గ్రేటర్ ఎన్నికల్లో పార్టీకి 48 సీట్లు వచ్చాయి . మేయర్ పీఠానికి కొద్ది దూరంలో ఆగిపోయింది. GHMC పీఠాన్ని బీజేపీ గెలుస్తుందా? లేక వరంగల్లో బీజేపీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటాదా.. చూద్దామని బండి సంజయ్ సవాల్ విసిరారు.
వరంగల్ మేయర్ పీఠంపై బండి సంజయ్ ఫోకస్.. జీహెచ్ఎంసీలో ప్రచారం లేనట్టేనా?
0
15
Previous article
Latest Articles
‘జెన్ జీ’ఓటర్లను ఆకర్షించలేకపోతున్న కాంగ్రెస్
తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు 'జెన్ జీ' ఓటర్ల చుట్టూ తిరుగుతున్నాయి. నవతరం ఓటర్లను ఆకట్టుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ సభ్యత్వ నమోదుతో దూసుకుపోతుంటే.. అధికార కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఆ హడావుడి కనిపించడం లేదు....
- Advertisement -
- Advertisement -


