కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఎర్రంపాలెం గ్రామంలో ఒకే కుటుంబం ఉమ్మెత్త పువ్వును ఆహారంగా తినడం వల్ల తీవ్ర అస్వస్థకు గురైంది.
ఇంస్టాగ్రామ్లో వీడియో చూసి ప్రభావితమైన ఈ కుటుంబం, కందిపప్పు కూరలో ఉమ్మెత్త పువ్వు కలిపి తిన్నారు. దీంతో కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తుల పరిస్థితి విషమంగా మారింది.
వారిని వెంటనే కాకినాడ జీజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యుల ప్రకారం ఉమ్మెత్త పువ్వుకు నిర్దిష్టమైన విరుగుడు లేదు. ప్రస్తుతం నలుగురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు సమాచారం.


