కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్రంగా ఫైర్ అయ్యారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. తెలంగాణ అభివృద్ధిని అడ్డుపడుతున్నారని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే మెట్రోరైలు పనులు ప్రారంభమైందని గుర్తు చేశారు. ఇక, మెట్రో విస్తరణ కూడా కాంగ్రెస్ హయాంలోనే జరుగుతుందని చెప్పారు.
కులగణనలో తప్పులుంటే ఆధారాలతో రండి రావాలని సవాల్ విసిరారు టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్. తాము చర్చకు సిద్ధం అని స్పష్టం చేశారు. బీసీలకు న్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీయేనని.. మిగిలిన పార్టీలకు ఆ సత్తాలేదన్నారు. మున్నూరు కాపులకు అన్యాయం జరిగిందనడంలో వాస్తవం లేదన్నారు. ఏ కులానికి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం కాంగ్రెస్కు లేదని తేల్చి చెప్పారు.