కర్నూలు జిల్లా పత్తికొండలో శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి రథోత్సవం అంగరంగ జరిగింది. ప్రతీ ఏడాది మాదిరిగానే స్వామివారి రథ యాత్ర అశేష జన వాహిని నడుమ ఘనంగా సాగింది. రథోత్సవం పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే వేద పండితులు తులసి అర్చన, కుంకుమ అర్చన, పాలాభిషేకం, పంచామృతభిషేకం వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారిని రథంపై ఆశీనులు చేసి గ్రామ పుర వీధుల్లో ఉరేగించారు. ఉత్సవాలు పురస్కరించుకుని స్వామివారి ఆలయంను వివిధ రకాల విద్యుత్ దీపాలు, పూలతో అలంకరణ చేశారు. ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్, మాజీ డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఘనంగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రథోత్సవం
0
212
Previous article
Next article
Latest Articles
కేంద్రానికి, సీబీఎస్ఈ బోర్డుకు కేటీఆర్ సూటి ప్రశ్నలు
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మూల్యాంకనంలో అవకతవకలపై అటు కేంద్రాన్ని ఇటు సీబీఎస్ఈ బోర్డుని నిలదీశారు. న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులకు ఆయన మద్దతు...
- Advertisement -
- Advertisement -


