మూడు నెలల్లో విశాఖకు TCS వస్తుందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఐటీ కంపెనీలు, ఉద్యోగాల కల్పనపై ఎమ్మెల్యేల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఐదు సంవత్సరాల్లో 5 లక్షల ఐటీ ఉద్యోగాలే తమ లక్ష్యమని వివరించారు. టీడీపీ హయాంలో 2014 నుంచి 2019 మధ్యలో సుమారు 150 కంపెనీలు 50 వేల మందికి ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. ఈ పరిశ్రమలను ఆనాడు చొరవతో తీసుకొచ్చామని.. అనేక సదస్సులు ఏర్పాటుచేసి విశాఖపై దృష్టిసారించామన్నారు. ముందుచూపుతో ఆనాడు డేటా సెంటర్ పాలసీ తీసుకొచ్చి అదానీ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని వివరించారు. భూములు కేటాయించి శంకుస్థాపనలు చేశామని.. కానీ అది ఆగిపోయిందన్నారు. 2019-24 మధ్య ఒక్క కాంక్లేవ్ జరగలేదన్న మంత్రి.. ఒక్క పరిశ్రమ కూడా రాలేదని సభలో వివరించారు.
ఐటీ కోసం కొత్త పాలసీ తీసుకురాబోతున్నాం – నారా లోకేశ్
0
137
Previous article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


