రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది – సబిత

మహిళలపై దాడులు జరుగుతున్నా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించడా అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. కొమురం భీం జిల్లా జైనూర్ మండలంలో ఆటో డ్రైవర్ దాడిలో గాయపడిన మహిళను పరామర్శించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం గాంధీ ఆసుపత్రికి వెళ్లారు. రాష్ట్రంలో మహిళలకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోయిందని సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. వరుసగా రాష్ట్రంలో మహిళపై దాడులు జరుగుతున్నా సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. 8 నెలల్లో మహిళలపై 1,800 పైగా అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగాయన్నారు. వాటన్నింటిని ప్రభుత్వం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోందని ఆగ్రహించారు. మహిళలంటే ఓ చులకనభావంగా పరిపాలన కొనసాగుతోందని అన్నారు. జైనూరు ఘటన చాలా బాధాకరమని అన్నారు. మహిళపై దారుణంగా దాడికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.

Latest Articles

విజయ్‌పై నాకు అసూయ లేదు.. కమల్‌హాసన్‌పై ఉండేదేమో- రజనీకాంత్‌

తమిళనాడులో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై సూపర్‌స్టార్ రజనీకాంత్ తొలిసారి స్పందించారు. తాను రాజకీయాల్లో లేనని స్పష్టం చేశారు. విజయ్ ముఖ్యమంత్రి కావడంపై అసూయ పడాల్సిన అవసరం తనకు లేదన్నారు. “విజయ్ సీఎం కావడంపై...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్