31 C
Hyderabad
Friday, July 11, 2025
spot_img

రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది – సబిత

మహిళలపై దాడులు జరుగుతున్నా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించడా అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. కొమురం భీం జిల్లా జైనూర్ మండలంలో ఆటో డ్రైవర్ దాడిలో గాయపడిన మహిళను పరామర్శించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం గాంధీ ఆసుపత్రికి వెళ్లారు. రాష్ట్రంలో మహిళలకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోయిందని సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. వరుసగా రాష్ట్రంలో మహిళపై దాడులు జరుగుతున్నా సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. 8 నెలల్లో మహిళలపై 1,800 పైగా అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగాయన్నారు. వాటన్నింటిని ప్రభుత్వం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోందని ఆగ్రహించారు. మహిళలంటే ఓ చులకనభావంగా పరిపాలన కొనసాగుతోందని అన్నారు. జైనూరు ఘటన చాలా బాధాకరమని అన్నారు. మహిళపై దారుణంగా దాడికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్