ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారీస్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న రాత్రి మరోసారి 11మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది కూటమి ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్. ప్రస్తుతం బదిలీ అయిన కొందరు అధికారులు జులై 20న వివిధ స్థానాలకు బదిలీ చేసినా వారు అక్కడ వివిధ కారణాల వల్ల చేరలేదు. ఇప్పుడు వారికి కొత్త పోస్టింగ్లు ఇచ్చారు. మరికొందరిని ప్రస్తుత స్థానం నుంచి బదిలీ చేశారు.
ప్రణాళిక సంఘం జాయింట్ సెక్రటరీగా అనంత శంకర్, స్పోర్ట్స్ అథారిటీ ఎండీగా పీఎస్ గిరీషా, కర్నూలు జాయింట్ కలెక్టర్గా నవ్య, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టరుగా భార్గవి… ఫైబర్ నెట్ ఎండీగా దినేష్ కుమార్ బదిలీ అయ్యారు. ఏపీ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, డ్రోన్ కార్పోరేషన్ ఎండీగా దినేష్ కుమార్కు అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఏపీ ఎయిర్ పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య, అనంతపురం జాయింట్ కలెక్టర్గా హరిత… తూర్పు గోదావరి జాయింట్ కలెక్టర్గా చిన్న రాముడు, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా శ్రీనివాసులు, పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్గా రాహుల్ కుమార్ రెడ్డి, విజయనగరం జాయింట్ కలెక్టర్గా సేదు మాధవన్, నెల్లూరు జాయింట్ కలెక్టర్గా కార్తీక్ ట్రాన్స్ఫర్ అయ్యారు.


