తమ భూములను దౌర్జన్యంగా లాక్కునేందుకు యత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు సూర్యాపేట జిల్లా నర్సింహాపురం రైతులు. ఆకుపాముల గ్రామ రెవెన్యూ శివారులో తమ పూర్వీకుల కాలం నుంచి భూములు సాగు చేసుకుంటున్నామన్న బాధితులు కుటుంబ అవసరాల కోసం తనఖా పెట్టి అప్పు తీసుకున్నట్టు తెలిపారు. అయితే తమ గ్రామానికి చెందిన ఓ కుటుంబం తమ భూముల్లో అక్రమం గా ప్రవేశించి సాగుకు యత్నిస్తున్నారని వాపోయారు. వారిపై తక్షణమే చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


