మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వాగ్దాటి ముందు ఎవరూ నిలవలేరని ప్రధాని మోదీ అన్నారు. వెంకయ్య నాయుడితో సుదీర్ఘకాలం పనిచేసే అవకాశం నాకు దక్కిందని చెప్పారు. వెంకయ్యనాయుడి పుట్టిన రోజు సందర్భంగా ఆయన జీవిత ప్రస్థానంపై రూపొందించిన మూడు పుస్తకాలను వర్చువల్గా ప్రధాని విడుదల చేశారు. గ్రామీణం ప్రాంతం నుంచి ఉన్నత స్థానానికి ఎదిగారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. 17 నెలల జైలు జీవితం గడిపారని గుర్తు చేశారు. గ్రామీణ, పట్టణాభివృద్ధి శాఖలో వెంక య్యనాయుడు తనదైన ముద్ర వేశారని చెప్పారు. వెంకయ్య జీవితంపై పుస్తకాలు ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయన్నాయని ప్రధాని మోదీ అన్నారు.


