తెలంగాణ నుంచి జనం సొంతూళ్లకు పయనమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో ఎల్లుండి జరిగే పోలింగ్ లో ఓటు హక్కు వినియోగించుకునేందు హైదరాబాద్ లో ఉండే ఏపీ ప్రజలు, తెలంగాణలోని ఇతర జిల్లా లకు చెందిన ప్రజలు తమ సొంత గ్రామాలకు వెళ్తున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. పది రోజుల నుంచే బస్సుల్లో సీట్లన్నీ ఫుల్ అయ్యాయి. ముఖ్యంగా విజయవాడ, విశాఖ పట్టణం, తూర్పు గోదావరి, ఒంగోలు, గుంటూరు తదితర జిల్లాలకు వెళ్లేవారితో హైదరాబాద్ లోని పలు బస్టాండ్ లలో ప్రయాణికులతో రద్దీ ఏర్పడింది. హైదరాబాద్ నుంచి ఏపీ ఓటర్లు వెళ్తిపోతుండటంతో టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఓటు హక్కును వినియోగిం చుకునేందుకు హైదరాబాద్ నుంచి ఏపీ ప్రజలు భారీ సంఖ్యలో ఏపీకి తరలివెళ్తున్నారు. దీంతో నిన్న సాయంత్రం నుంచి హైదరాబాద్ – విజయవాడ నేషనల్ హైవేపై వాహనాల రద్దీ పెరిగింది. పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి చేరుకోవడంతో పలు చోట్ల నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. దీనికి తోడు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ లు అవుతుండటంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చౌటుప్పల్, పంతంగి, కొర్లపహాడ్ టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి.