చివరి రోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీని రంగంలోకి దింపింది. ఇవాళ ప్రియాంక గాంధీతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాండూర్ , కామారెడ్డిలలో పర్యటించనున్నారు. కాసేపట్లో పఠాన్చెరు కార్నర్ మీటింగ్లో పాల్గొననున్నారు. మధ్యా హ్నం ఒంటిగంటకు తాండూర్ జన జాతర సభకు ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి హాజరవుతారు. సాయంత్రం 3.15 గంటలకు ప్రియాంక గాంధీతో కలిసి కామారెడ్డిలో రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.