ఏపీలో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇవాళ మంచి రోజు కావడంతో పలువురు నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో నేడు పలువురు అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు.పాతపట్నం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా రెడ్డి శాంతి, పలాస వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా మంత్రి సీదిరి అప్పలరాజు, ఆమదాలవలస అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా సురేష్ కుమార్ , ఆమదాలవలస వైసిపి అసెంబ్లీ అభ్యర్థిగా తమ్మినేని సీతారాం నామినేషన్లు వేయనున్నారు. టెక్కలి టిడిపి అసెంబ్లీ అభ్యర్థిగా అచ్చెంనాయుడు నామినేషన్లు దాఖలు చేస్తారు.
అటు కాకినాడ జిల్లాలోనూ పలువురు అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. కాకినాడ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి , కాకినాడ రూరల్ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా కురసాల కన్నబాబు, పెద్దాపురం అసెంబ్లీ టిడిపి అభ్యర్థిగా నిమ్మకాయల చిన్నరాజప్ప పిఠాపురం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా వంగా గీత నామినేషన్లు దాఖలు చేస్తారు. అమలాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రి విశ్వరూప్, కొత్తపేట వైసీపీ అభ్యర్ధిగా జగ్గిరెడ్డి నామినేషన్లు దాఖలు చేస్తారు.