23న వరంగల్ జిల్లాలో కేటీఆర్ పర్యటన

  లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈనెల 23న వరంగల్ లో పర్యటిస్తారని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ తెలిపారు. బాలసముద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వరంగల్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ రేపు నామి నేషన్ వేయనున్నట్లు ఆయన తెలిపారు. నామినేషన్ కు ముందు ర్యాలీలో పెద్దఎత్తున పాల్గొనాలని దాస్యం వినయ్ భాస్కర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 23న వరంగల్, వర్ధన్నపేట నియోజకవర్గాల పార్టీ సమావేశాలకు కేటీఆర్ హాజరవుతారని సుధీర్ కుమార్ తెలిపారు. బిఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసిన ఆరూరి రమేష్, కడియం కావ్యం ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించాలని బిఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ పేర్కొన్నా రు.కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు అన్ని విధాలుగా నష్టం చేసిందన్నారు.

Latest Articles

తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన

తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్