ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆనంద్, ఇందిర దంపతులకు ఓ కుమారుడు ఉన్నారు. కొంతకాలంగా దంపతులు తీవ్రమైన అప్పుల బాధతో ఇబ్బందిపడుతున్నారు. ఈ నేపథ్యంలో సన్ సిటీలోని తమ ఫ్లాట్లో మూడేళ్ళ కుమారుడికి విషం తాగించి తాము తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం ఆత్మహత్య
0
240
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


