25.2 C
Hyderabad
Thursday, November 6, 2025
spot_img

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ట్యాగ్‌ చేస్తూ గౌతమ్‌ గంభీర్‌ ట్వీట్‌

    బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. తనను రాజకీయ విధుల నుంచి తప్పించాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను అభ్య ర్థించారు. క్రికెట్‌కు సంబంధిం చిన బాధ్యతల నిమిత్తం.. తనన్ను రాజకీయ విధుల నుంచి తప్పించ మని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను అభ్యర్థిం చానన్నారు. ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. జై హింద్‌ అంటూ ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.

      గంభీర్ 2019లో బీజేపీలో చేరారు. తూర్పు ఢీల్లీ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన ఆయన.. స్థానికంగా కీలకంగా వ్యవహరించారు. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆయనకు టికెట్‌ దక్కకపో వచ్చనే వార్తల నేపథ్యం లో ఆయన ఈ పోస్ట్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు ప్రధాని మోదీ సారథ్యంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ రెండురోజుల క్రితం సమావేశం నిర్వహించింది. ఏ క్షణమైనా ఆ జాబితా విడుదలయ్యే అవకాశాలు కనిపి స్తున్నాయి. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌ షాతో సహా సుమారు వంద మందికి పైగా అభ్యర్థు లతో ఆ లిస్ట్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్