టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ నెల్లూరు, గురజాల నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. చంద్రబాబు హైదరాబాద్లో తన నివాసం నుంచి నేరుగా నెల్లూరు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంట లకు స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. ఇటీవలె వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరనున్నారు. అనంతరం మధ్యాహ్నం చంద్రబాబు పల్నాడు జిల్లా దాచేపల్లి చేరుకుంటారు. అక్కడ కేసానుపల్లె సభలో ఏర్పాటు చేసిన రా కదలిరా సభలో మాట్లాడతారు. ఈ వేదిక మీదే లావు శ్రీ కృష్ణదేవరాయాలు టీడీపీ కండువా కప్పుకోనున్నారు.


