ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష టీడీపీలోకి అధికార పక్షం వైసీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్నాయి. ఇటీవలే వైసీపీ రాజీనామా చేసిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు టీడీపీ గూటికి చేరనున్నారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకోనున్నారు.హైదరాబాద్లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరనున్నారు. నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కుటుంబ సభ్యులు, అనుచరులు తెలుగుదేశంలో చేరనున్నారు. మధ్యాహ్నం గురజాలలో జరగనున్న ‘ రా కదలిరా బహిరంగ సభ’లో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు కూడా విపక్ష పార్టీలో చేరనున్నారు. ఈ ముగ్గురు కీలక నేతలు ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేశారు.
టీడీపీలోకి వైసీపీ నుంచి కొనసాగుతున్న వలసలు
0
178
Previous article
Next article
Latest Articles
సైబర్ క్రైమ్ కేసులో హైదరాబాద్ వ్యాపారిని అరెస్టు చేసిన కొచ్చి పోలీసులు
సైబర్ క్రైమ్ కేసులో హైదరాబాద్ వ్యాపారిని కొచ్చి పోలీసులు అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. 24 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలు రావడంతో ప్రధాన నిందితుడు హైదరాబాద్కు చెందిన వ్యాపారి అల్లంరాజు...
- Advertisement -
- Advertisement -


