29.2 C
Hyderabad
Saturday, January 17, 2026
spot_img

వంట గ్యాస్ ధర తగ్గింపుపై TPCC చీఫ్ రేవంత్ రెడ్డి సెటైర్..!

స్వతంత్ర వెబ్ డెస్క్: రక్షాబంధన్ కానుకగా వంట గ్యాస్ ధరలు తగ్గించింది కేంద్రం. సిలిండర్ పై 250 సబ్సిడీని ప్రకటించింది. ఉజ్వల స్కీం లబ్ధిదారులకు సిలిండర్ పై 400 రూపాయలు తగ్గించింది. తగ్గించిన ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని కేంద్ర కేబినెట్ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో 14 కేజీల వంట గ్యాస్ బండ ధర 1100 రూపాయలుగా ఉంది. కేంద్రం తాజా నిర్ణయంతో ఉజ్వల్ లబ్ధిదారులకు ఇకనుండి 700 కే సిలిండర్ లభించనుంది.

ఇక సాధారణ గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ 950 కి లభించనుంది. అయితే కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించడం పట్ల ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు రేవంత్ రెడ్డి. “ఒక గజదొంగ దారి దోపిడీ చేసి సర్వం దోచుకొని.. దారి ఖర్చులకోసం 200 రూపాయలు ఉంచుకోమని ఇచ్చాడట. కాంగ్రెస్ హయాంలో 410 గ్యాస్ బండ ధరను రూ. 1200 చేసి, ఇప్పుడు 200 తగ్గించడాన్ని ఇలా కాక మరెలా అర్థం చేసుకోవాలి” అని ట్వీట్ చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్