స్వతంత్ర వెబ్ డెస్క్: బీఆర్ఎస్ లో(BRS) అసంతృప్తుల సెగ మొదలైంది. బీఆర్ఎస్ తొలి జాబితా ప్రకంపనలు సృష్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు(assembly elections) సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ షాక్ ఇచ్చారు. వారికి ఈసారి టికెట్ ఇవ్వలేదు.
టికెట్ దక్కకపోవడంతో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కాంగ్రెస్ లో చేరనున్నారని సమాచారం. మంగళవారం (ఆగస్టు 22) కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. కాగా, ఇప్పటికే రేఖానాయక్ భర్త అజ్మీరా శ్యామ్ నాయక్ కాంగ్రెస్ లో చేరిపోయారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రేఖా నాయక్ ను కాదని సీఎం కేసీఆర్ ఖానాపూర్ టికెట్ ను జాన్సన్ నాయక్ కు ఇచ్చారు. శ్యామ్ నాయక్ కి ఆసిఫాబాద్ టికెట్ పై కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టు సమాచారం.