స్వతంత్ర వెబ్ డెస్క్: ఇటీవల తల్లిదండ్రులైన మెగా పవర్ స్టార్ రాంచరణ్-ఉపాసన దంపతులు ఈ మధ్యాహ్నం మీడియా ముందుకు రానున్నారు. ఈ నెల 20న ఉపాసన పండంటి పాపకు జన్మనిచ్చిన ఉపాసన నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి బయటకు వచ్చిన తర్వాత మధ్యాహ్నం 1.30 గంటలకు రాంచరణ్ దంపతులు అపోలో ఆసుపత్రి వద్దనున్న నాగమ్మ ఆలయం వద్ద మీడియాతో మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా తమకు శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ వారు కృతజ్ఞతలు తెలపనున్నారు. కాగా, మీడియా సమావేశంలో పాప ఫొటోలు విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.
మధ్యాహ్నం మీడియా ముందుకు రాంచరణ్-ఉపాసన
0
639
Previous article
Latest Articles
పుల్వామా దాడుల సూత్రధారి హతం
పుల్వామా దాడుల వెనుక కీలక సూత్రధారిగా ఉన్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హంజా బుర్హాన్ హతమయ్యాడు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాద్లో హంజా బుర్హాన్ హతమైనట్టు తెలుస్తోంది.
గుర్తు తెలియని వ్యక్తులు టెర్రరిస్ట్ హంజా...
- Advertisement -
- Advertisement -


