స్వతంత్ర, వెబ్ డెస్క్: హుస్సేన్ సాగర్ తీరాన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం ఫినిషింగ్ పనులను ఆదివారం ఉదయం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణమంతా కలియ తిరిగారు. మెట్రో పాలిటన్ కమిషనర్(HMDA) అరవింద్ కుమార్ కు నిర్మాణ ప్రాంగణ వెలుపల గల రోడ్డు, ఫుట్ పాత్, పలు సుందరీకరణ అంశాలపై పలు సూచనలు చేశారు. అనంతరం.. ఈనెల 14న కొత్తగా ఆర్ అండ్ బి శాఖ ఆద్వర్యంలో నిర్మించే నిమ్స్ హాస్పిటల్ భవనానికి సీఎం శంకుస్ధాపన ఏర్పాట్లు అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రాంగణమంతా కలియ తిరుగుతూ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆర్ అండ్ బి శాఖ తరుపున అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి సూచించారు. మంత్రి వెంట ఆర్ అండ్ బి ఈఎన్సి గణపతి రెడ్డి,ఎస్.ఈ హఫీజ్,ఈ.ఈ శశిధర్, డి.ఈ మోహన్,మాధవి,నిమ్స్ డైరెక్టర్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు తదితరులు ఉన్నారు.
అమరవీరుల స్మారక నిర్మాణ పనులు, నిమ్స్ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి వేముల
0
455
Previous article
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


