స్వతంత్ర, వెబ్ డెస్క్: విజయవాడలో వైసీపీ ఎమ్మెల్సీ మహ్మద్ రుహుల్లా కారు బీభత్సం సృష్టించింది. బీఆర్టీఎస్ రోడ్డులో శనివారం అర్ధరాత్రి వేగంగా బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బైకును బలంగా ఢీకొట్టడంతో కారు ముందుభాగం ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన వెంటనే కారుపై ఉన్న ఎమ్మెల్సీ స్టిక్కర్ను అనుచరులు తొలగించారు. ఆ తర్వాత కారును అక్కడే వదిలేసి డ్రైవర్తో కలిసి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారును స్వాధీనం చేసుకుని గుణదల పోలీస్ స్టేషన్కు తరలించారు.