మొట్టమొదటి మహిళా యాంకర్ మృతిపై ప్రముఖులు సంతాపం

స్వతంత్ర, వెబ్ డెస్క్: దేశంలోనే మొట్టమొదటి మహిళా న్యూస్ ప్రెజెంటర్ గీతాంజలి అయ్యర్(70) మృతిపై పలువురు జర్నలిస్టులు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆమె సేవలను కొనియాడుతున్నారు. కోల్‌కతాలోని లొరేటో కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన గీతాంజలి 1971లో దూరదర్శన్‌లో చేరారు. వార్తలు చదవడంతో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు గాను ఉత్తమ యాంకర్‌గా నాలుగుసార్లు అవార్డులు అందుకున్నారు. 1989లో ఔట్‌స్టాండింగ్ మహిళగా దివంగత ప్రధాని ఇందిరాగాంధీ చేతులమీదుగా ప్రియదర్శని అవార్డు అందుకున్నారు. దూరదర్శన్‌లో ఇంగ్లిష్ న్యూస్ ప్రెజెంటర్‌‌గా పనిచేసిన ఆమె గత కొంతకాలంగా పార్కిన్‌నన్స్ అనే మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం ఇంట్లోనే ఆమె కుప్పకూలిపోయి మరణించారు.

Latest Articles

నా ప్రెస్‌మీట్‌కైనా అనుమతి ఇస్తారా?.. ఎక్స్ వేదికగా కోరిన పవన్ కళ్యాణ్

తెలంగాణలో జనసేన సభకు అనుమతి నిరాకరించడంపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ స్పందించారు. తన ప్రెస్ మీట్ కైనా అనుమతి ఇస్తారా అని ఎక్స్‌ వేదికగా కోరారు. మీడియా సమావేశానికి అనుమతిస్తారని ఆశిస్తున్నానని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్