25.7 C
Hyderabad
Wednesday, June 18, 2025
spot_img

ఒంటి నిండా బంగారంతో శ్రీవారిని దర్శించుకున్న కుటుంబం

స్వతంత్ర, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఓ కుటుంబాన్ని చూసి భక్తులంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ కుటుంబమంతా బంగారంతో చేసిన భారీ ఆభరణాలు ధరించారు. ఆ బంగారు ఆభరణాలపై వేంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి ప్రతిమలు ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాట్లంకు చెందిన సుభాష్ చంద్ర కుటుంబసభ్యులు గోవిందుడిని తమ ఇంటి ఇలవేల్పుగా చూసుకుంటారట.

పూర్వీకుల కాలం నుంచి శ్రీవారిని ఇంటి దైవంగా భావించి పూజిస్తున్నామని వారు తెలిపారు. స్వామి, అమ్మవార్ల ప్రతిమలతో తయారు చేయించిన బంగారు ఆభరణాలు ధరించి శ్రీవారిని దర్శించుకోవడం కూడా వారి పూర్వీకుల నుంచి ఆనవాయితీగా కొనసాగుతోందని చెప్పారు. ఆ ఆభరణాలను కూడా తమ పూర్వీకులు తయారు చేయించారని వెల్లడించారు. ఒంటిపై బంగారు నగలతో మెరిసిపోయిన వీరితో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు భక్తులు ఆసక్తి కనబరచడం విశేషం.

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్