స్వతంత్ర, వెబ్ డెస్క్: ఏపీలో వేడి వాతావరణం కొనసాగుతుందని వెల్లడించింది అమరావతి వాతావరణ కేంద్రం. పశ్చిమ దిశ నుంచి పొడిగాలులు వీస్తున్నాయని వివరించింది. మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా కర్ణాటక వరకు ఉపరితల ద్రోణిచురుకుగా కదులుతుందని పేర్కొంది. దీంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అలాగే అక్కడక్కడా ఉరుములు, పిడుగులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు.. రాగల రెండ్రోజుల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం అంతటా విస్తరిస్తాయని తెలిపింది.


