21.8 C
Hyderabad
Monday, September 29, 2025
spot_img

ప్రాణ భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు

స్వతంత్ర వెబ్ డెస్క్: హజ్రత్ నిజాముద్దీన్ నుంచి త్రివేండ్రం వెళ్తున్న స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్‌లో అకస్మాత్తుగా పొగలు వచ్చాయి. దీని గమనించిన లోకోపైలెట్ ముందు జాగ్రత్తగా వెంటనే ట్రైన్‌ను నిలిపేశాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలోని గార్ల మండలం రాంపురం వద్ద చౌ చేసుకుంది. ఉన్నట్లుండి ట్రైన్‌లో నుంచి పెద్దఎత్తున పొగ వెలువడడంతో బోగీల్లోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఏదో జరుగుతోందో అర్థం కాక ఆందోళనకు గరుయ్యారు.

ఇంతలో లోకో పైలట్ ట్రైన్ ను అక్కడే నిలపగా.. రైలు బోగీల్లో మంటలు చెలరేగుతాయనే అనుమానంతో భయపడిపోయిన ప్రయాణికులు.. ట్రైన్ ఆపిన వెంటనే హుటాహుటిన అందులో నుంచి బయటకు పరుగులు తీశారు. ట్రైన్‌లో నుంచి పొగలు వెలువడుతున్నాయనే సమాచారంతో అక్కడికి చేరుకున్న రైల్వే సిబ్బంది.. తక్షణ చర్యలు చేపట్టారు. బ్రేక్ లైనర్లు బిగుసుకోవటంతోనే పొగలు వచ్చినట్లు రైల్వే అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. మరమ్మత్తులు పూర్తిచేసి రైలును పంపించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోటవంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్