దేశంలోనే సంపన్న సీఎం అయిన జగన్ పేదవాడంటా?: అచ్చెన్న

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మహానాడు వేదికగా సీఎం జగన్‌పై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. రాజమహేంద్రవరంలో జరగుతున్న మహానాడులో ఆయన ప్రసంగిస్తూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం గుప్పించారు. తనకు టీవీ లేదు, పేపర్ లేదు, బంగళా లేదు, తాను పేదవాడినని ప్రజలను మళ్లీ జగన్ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా అయినప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేక ఇంటిని తాకట్టు పెట్టిన జగన్… ఇప్పుడు దేశంలోనే అత్యంత ధనవంతుడైన సీఎం అని విమర్శించారు.

చెన్నై, బెంగళూరు, ఇడుపలపాయ, పులివెందుల, లోటస్ పాండ్, అమరావతి ప్యాలెసులు ఎవరివో చెప్పాలని అచ్చెన్న సవాల్ విసిరారు. తాడేపల్లి ప్యాలెస్ డబ్బులతో నిండిపోయిందని దీంతో ఇప్పుడు ఆ డబ్బును ఇడుపులపాయకు తరలించి భూమిలో దాచిపెడుతున్నారని ఆరోపించారు. రూ.2వేల నోట్లను ఆర్బీఐ ఉపసంహరించడంతో ఇప్పుడు వాటిని మార్చుకోలేక జగన్ తల్లడిల్లిపోతున్నారని ఎద్దేవా చేశారు.

Latest Articles

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. తుమ్మల స్టేట్ మెంట్ రికార్డ్

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Tummala Nageswara Rao) స్టేట్‌మెంట్‌ను నమోదు చేసింది. ఇందుకోసం సిట్ అధికారులు మంత్రి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్