19.7 C
Hyderabad
Saturday, February 14, 2026
spot_img

మచిలీపట్నానికి చంద్రబాబు తీవ్ర ద్రోహం చేశాడు: సీఎం జగన్

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మచిలీపట్నంలో బందరు పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. బందరు పోర్ట్ కు శతాబ్దాల చరిత్ర ఉందని అన్నారు. రూ.5,156 కోట్లతో, నాలుగు బెర్తులతో ఈ పోర్టు ప్రారంభం అవుతుందని సీఎం వ్యాఖ్యానించారు. ట్రాఫిక్ పెరిగేకొద్దీ బెర్తులను పెంచి 116 మిలియన్ టన్నుల వరకు సామర్థ్యం పెంచే అవకాశం ఉందని వివరించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడుతూ.. మచిలీపట్నానికి బాబు తీవ్ర ద్రోహం చేశాడని అన్నారు. ఇక పోర్టు గ్రహణాలన్నీ తొలగిపోయాయి..అడుగులు వేగంగా పడతాయి.. మచిలీపట్నం రూపు రేఖలు మారుతున్నాయని సీఎం వెల్లడించారు. గతంలో బందరు జిల్లా హెడ్ క్వార్టర్ అయినా కలెక్టర్ తో సహా ఒక్క అధికారి కూడా ఇక్కడ ఉండేవారు కాదు.. వారంలో ఒకరోజు వస్తే అదే పదివేలు అన్నట్లు పరిస్థితి ఉండేది.. ఇప్పుడు కలెక్టర్ తో సహా మొత్తం యంత్రాంగం ఇక్కడే ఉంటున్నారని సీఎం వ్యాఖ్యానించారు.

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్