సమ్మర్ అలర్ట్: తెలంగాణలోని 14 జిల్లాలకు డేంజర్ బెల్స్

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్టంలో ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటేనే జనం బెంబెలేత్తిపోతున్నారు. ఎండలు పెరగడంతో రాత్రి పగలు అనే తేడా లేకుండా ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వారం రోజుల క్రితం వరకు వర్షాలతో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే ఇప్పుడు ఉష్ణోగ్రతలు అమాంతంగా పెరిగిపోయాయి. గడిచిన 24 గంటల్లో కరీంనగర్, జనగాం, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేటి నుంచి తెలంగాణలోని 14 జిల్లాల్లో ఎండలు ఠారెత్తనున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

నల్గొండ , సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి, వరంగల్, హన్మకొండ, కొమురం భీం, కరీంనగర్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో వడగాల్పుల తీవ్రంగా ఉంటుందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. మే 14 నుంచి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఎండల ప్రభావం అధికంగా ఉండనుందని చెప్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఎండలో బయటకు రావొద్దని వార్నింగ్ ఇచ్చారు.

Latest Articles

తెరుచుకున్న తుంగభద్ర గేట్లు… ముగ్గురు ముఖ్యమంత్రుల పూజలు

కర్ణాటక: తుంగభద్ర డ్యామ్‌ 33 కొత్త క్రస్ట్‌ గేట్లు తెరుచుకున్నాయి. గేట్లను ముగ్గురు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్‌ ప్రారంభించారు. 17వ గేటును కేంద్రమంత్రి సీఆర్‌పాటిల్ ప్రారంభించారు. 18వ గేటును...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్