టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నేతల బృందం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి( C. Sudarshan Reddy)ని కలిసి కీలక అంశాలపై చర్చించింది.
ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్( Ponnam Prabhakar), రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్( Anil Kumar Yadav), ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డది( Chamala Kiran Kumar Reddy), ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్( Balmuri Venkat)తో పాటు పలువురు ఎమ్మెల్యేలు,కార్పొరేషన్ చైర్మన్లు , ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
SIR ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాలని కాంగ్రెస్ నేతల బృందం రాష్ట్ర ఎన్నికల అధికారిని కోరింది. ఓటర్ల జాబితా సవరణలో ఎలాంటి లోపాలు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.


