గీతం యూనివర్సీటీలో దారుణం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం విశ్వవిద్యాలయంలో రేణుశ్రీ అనే బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పిడింది. గీతం యూనివర్సిటీ భవనం ఆరో అంతస్తు నుండి కిందకు దూకి ఆత్మ హత్య చేసుకుంది. విద్యార్థిని యూనివర్సిటీ భవంతి పై నుంచి దూకుతుండగా కొందరు విద్యార్థులు వీడియో తీయడం గమనార్హం. కాగా… ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.