Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

చంద్రబాబు అస్త్రం షర్మిల అంటున్న వైసీపీ

      నిన్న, మొన్నటి వరకూ ఆమె వైఎస్ఆర్ కుమార్తె…. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సోదరి…. ప్రతి పక్షాల పై జగనన్న విడిచిన బాణం… కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.. ఆమె వైఎస్ఆర్ కుమార్తె కాదు … జగన్ వదిలిన బాణం అంత కంటే కాదు….తాజాగా షర్మిల, చంద్రబాబు చివరి అస్త్రం. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు… అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు… ఒకప్పుడు.. ఆమె జగనన్న విడిచిన బాణం. అన్నను కాదని కాంగ్రెస్ లో చేరి పీసీసీ అధ్యక్షురాలిగా నియమితురాలైతే చంద్రబాబు అస్త్రం ఎలా అయింది.

     ఏపీలో వైఎస్ ఆర్ సీపీ తీవ్ర గందరగోళంలో ఉంది. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ఎమ్మె ల్యేల మార్పులు చేర్పులతో పార్టీలో అయోమయ పరిస్థితి ఏర్పడింది. టికెట్ రాదనుకున్నకొందరు, ఇచ్చినా గెలవమని అనుకున్న చాలా మంది పార్టీ వదిలిపోతున్నారు. టీడీపీ, జనసేనకు వలస పోతున్నారు. ఈ పరిస్థితిని జగన్ జీర్ణించు కోలేక పోతున్నారు. ఇదే సమయంలో పుండుమీద ఖారం చల్లినట్లు ఏపి కాంగ్రెస్ బాధ్యతలు షర్మిల చేపట్టడంతో వైసీపీ శ్రేణులు అసహనంతో రగిలిపోతున్నారు. విమర్శలు చేస్తున్నారు. జగన్ కి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారిని చంద్రబాబు కి అంట గట్టడం వైసీపీ కి అలవాటు… ఇప్పుడు షర్మిలను సైతం చంద్రబాబు మనిషిని చేశారు వైసీపీ నేతలు.

      రాజకీయంగా ఎదగాలంటే..వైసీపీ తెలంగాణ తో సాధ్యం కాదని గుర్తించిన వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధినాయక త్వానికి జై కొట్టారు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. జాక్ పాట్ కొట్టారు. ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టారు. దీంతో వైసీపీ నేతలు షర్మిలను టార్గెట్ చేస్తున్నారు. షర్మిల ఇలా పీసీసీ బాధ్యతలు చేపట్టగానే ఆమె చంద్రబాబు చివరి అస్త్రం అంటూ వైసీపీ ప్రచారం చేపట్టింది. చంద్రబాబు ను ఏపీ లో అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా షర్మిల పని చేస్తున్నారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

      నిజానికి గతంలో షర్మిల అన్న జగన్ మోహన్ రెడ్డిని ఏపి సీఎం చేయడం కోసం తీవ్రంగా శ్రమించారు. అక్రమ ఆస్తు ల కేసులో జగన్ జైల్ కి వెళ్తే పార్టీని బలోపేతం చేసే బాధ్యతను షర్మిల తీసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మూడు వేల కిలో మీటర్లు పైగా పాద యాత్ర చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ నీ గెలిపించాలని…. చంద్రబాబు ని ఓడించాలని రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో కీలక పాత్రవహించారు. అప్పుడు షర్మిల వైఎస్ఆర్ కుమార్తె, జగనన్న వదిలిన బాణం అంటూ ప్రశంసలు కురిపించిన వైసీపీ నేతలు తమ నియోజక వర్గాల్లో పోటీ పడి మరీ ఆమెతో ప్రచారం చేయిం చుకున్నారు. జగన్ సోదరిగా వైఎస్సార్ కుమార్తె గా షర్మిల పట్ల వైసీపీ నేతలు ఆదరాభిమానాలు చూపారు. కానీ షర్మిల ఏపీసీసీ బాధ్యతలు తీసుకోగానే ఒక్కసారిగా వైసీపీ నేతలు ఆమెని టార్గెట్ చేస్తున్నారు. వైఎస్ షర్మిలను కాస్తా…మొరు సుమల్లి షర్మిల గా మార్చేశారు ఆమె మొరుసుమల్లి షర్మిల అంటూ వైసీపీ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు అస్త్రం అంటూ ప్రచారం చేస్తున్నారు.

       ఏపీలో మొదటి నుంచీ వైసీపీ కొత్త ట్రెండ్ మొదలు పెట్టింది. జగన్ ప్రభుత్వాన్ని విమర్శించే ఏ రాజకీయ నాయకు డైనా, మేధావులు అయినా వాళ్ళని చంద్రబాబు మనుషులు అంటూ ముద్ర వేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యా ణ్ ను మొదటి నుంచి అదే దృష్టి తో చూస్తుంది వైసీపీ. దత్తపుతృడు అంటూ, చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకొని టీడీపీ కోసం పని చేస్తున్నారని విమర్శలు చేస్తుంది. ఇక ఇటీవల బీజేపీ రాష్ట్ర పార్టీ బాధ్యతలు చేపట్టిన దగ్గుపాటి పురంధేశ్వరి సైతం చంద్రబాబు కోసం పని చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు వైసీపీ నేతలు. 2019 ఎన్నికల్లో పురందరేశ్వరి బీజేపీ నుంచి పోటీ చేస్తే, ఆమె భర్త దగ్గుపాటి వెంకటేశ్వర రావు కి మాత్రం పర్చూరు అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఇచ్చింది వైసీపీ.

     ఇక వామపక్షాలు సైతం చంద్రబాబు కోసమే పని చేస్తున్నాయని వైసీపీ నేతలు విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజా గా వైఎస్ షర్మిల వంతు వచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక షర్మిలకు ఆ పార్టీతో సంబంధాలు తగ్గిపోయాయి. దీంతో తెలంగాణ లో ఆమె సొంతగా వైఎస్ఆర్ తెలంగాణ పేరు తో పార్టీ పెట్టుకున్నారు. అప్పుడు కూడా వైసీపీ ఆమెకు సపోర్ట్ చేయలేదు. వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసి, ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టడం అధికార వైసీపీ నేత లకు నచ్ఛ లేదు. దీంతో షర్మిలను సైతం చంద్రబాబు అస్త్రం అంటూ ముద్రవేసే యత్నం చేస్తోంది. షర్మిల ఏపీకి వచ్చీ రావడంతోనే రాజకీయంగా బిజీ అయ్యారు. ఆరంభంలోనే వైసీపీపై విమర్శాస్త్రాలు సంధించారు. ఏపీ కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు నడుం బిగించారు. జిల్లా పర్యటనలు చేపట్టారు. రోజూ మూడు జిల్లాల నేతల తో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక ముందు ఈ పర్యటనలో అధికారపార్టీపై ఎలాంటి కౌంటర్ ఇస్తారో అని వైసీపీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్