పేటీఎంకు సంబంధించి రిజర్వు బ్యాంక్ తీసుకున్న నిర్ణయంపై భారత్ పే వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్బీఐ నిర్ణయాలు ఫిన్టెక్ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయన్నారు అష్నీర్ గ్రోవర్. ఆర్బీఐ చర్యల విషయంలో ప్రధాని, ఆర్థిక మంత్రి జోక్యం చేసుకోవాలని అష్నీర్ గ్రోవర్ కోరారు. అసలు ఫిన్టెక్ వ్యాపారమే ఉండకూడదని రిజర్వు బ్యాంక్ భావిస్తోందని ఆయన మండి పడ్డారు. ఒక వైపు యూపీఐను ప్రోత్సహిస్తూ మరోవైపు దానిని ప్రారంభించినవారిని శిక్షించాలని అనుకోవడం సమంజసం కాదన్నారు అష్నీర్ గ్రోవర్.
ఆర్బీఐ నిషేధపు ప్రకటన చేసినప్పటి నుంచి పేటీఎం షేర్ల ధరలు తగ్గుతూ వచ్చాయి. రానున్న రోజుల్లో షేర్ల ధరలు మరింతగా పడిపోతాయని ఆర్థికరంగ నిపుణులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఆర్బీఐ నిర్ణయం కచ్చితంగా షేర్ హోల్డర్లపై ప్రభావం చూపుతుందని. బ్యాంకులకు డిజిటల్ ఆర్థిక సేవలను అందించే ఫ్లూటోవన్ కంపెనీ కంపెనీ సహ వ్యవస్థాపకుడు రజత్ గులాటీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఆంక్షల వల్ల ఫిన్టెక్ రంగంపై ప్రతికూల ప్రభావం ఉంటుందనే అభిప్రా యాన్ని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తోసిపుచ్చారు. ప్రతి ఆన్లైన్ కంపెనీ, చట్టానికి లోబడే పనిచే యాల్సి ఉంటుందని రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. పేటీఎంపై రిజర్వు బ్యాంకు ఆర్థిక ఆంక్షలు విధించిన తరువాతనే ఫిన్టెక్ కంపెనీలకు నిబంధనల ప్రాముఖ్యత తెలిసివచ్చిందన్నారు కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్. పేటీఎం బ్యాంకుకు సంబంధించి వినియోగదారులకు వచ్చే 30 అనుమానాలకు ఎఫ్ ఏ క్యూ రిజర్వు బ్యాంక్ విడుదల చేసింది.
ఈ ఏడాది మార్చి 15 తరువాత పీపీబీఎల్ వినియోగదారులు పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయడం కుదరదు. వడ్డీ, క్యాష్ బ్యాక్, రిఫండ్ మినహా ఇతర లావాదేవీలకు సంబంధించి డబ్బు ఈ బ్యాంకులోని వారి ఖాతాలో జమ అవదు. తమ లావాదేవీలకు ఎటువంటి అంత రాయం ఉండకూడదనుకుంటే ఖాతాదారులు తమ డబ్బు జమ చేయడం కోసం ఇతర బ్యాంకుల్లో ప్రత్యా మ్నాయ ఏర్పట్లు చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 15 తరువాత వేతనాలు, పింఛన్లు, కూడా పీపీబీఎల్ ఖాతాలో జమ అవ్వవు. కాగా పీపీబీఎల్ ద్వారా ఈఎంఐ లేదా ఓటీటీ చందా వంటివి చెల్లిస్తున్న వినియోగదారులు, ప్రత్యామ్నాయం చూసుకోవల్సి ఉంటుంది. పీపీబీఎల్ వాలెట్లలో ఉన్న డబ్బును మార్చి 15 తరువాత కూడా వాడుకోవచ్చు. అలాగే ఫాస్టాగ్లలో ఉన్న నగదు నిల్వను కూడా పూర్తయ్యే వరకు వాడుకోవచ్చు. అయితే మార్చి 15 తరువాత ఫాస్టాగ్లలో పీపీబీఎల్ ద్వారా టాప్అప్ చేసుకోవడం కుదరదు. పీపీబీఎల్ ఖాతా లేదా వాలెట్కు అనుసంధానమైన పేటీఎం క్యూ ఆర్ కోడ్, పేటీఎం సౌండ్ బాక్స్ , పేటీఎం పీఓఎస్ టెర్మినల్ ద్వారా చెల్లింపులు స్వీకరిస్తున్న వ్యాపారులకు మార్చి 15 వరకు ఈ సేవలు అందుబాటులో ఉండవు. ఈ నేపథ్యంలో ఇతర బ్యాంకులతో అనుసంధానమైన కొత్త క్యూ ఆర్ కోడ్ను వ్యాపారులు తీసుకోవాల్సి ఉంటుంది.