అమెరికాలో మరోసారి తుపాకీ విష సంస్కృతి జడలు విప్పింది. ఇల్లినాయిస్ రాష్ట్రంలో జోలియెట్ పట్టణంలో ఆది, సోమవారాల్లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది మృతి చెందారు. రెండు వేర్వేరు ఇళ్లలో ముష్కరుడు కాల్పులకు తెగబడ్డాడు. నిందితుడిని రోమియో నాన్స్గా గుర్తించారు. మరణించిన వారితో అతడికి ముందు నుంచే పరిచయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం నుంచే ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నప్పటికీ.. ఈ విష యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ప్రస్తుతం మరణాయుధాలతో రోమియో నాన్స్ ఎరుపు రంగు టయోటా కారు లో తప్పించుకు తిరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. అతడి గురించి ఎవరి దగ్గరైనా సమాచారం ఉంటే వెంటనే తెలి యజేయాలని విజ్ఞప్తి చేశారు.
అమెరికాలో కాల్పుల కలకలం.. 8 మంది మృతి
0
689
Previous article
Next article
Latest Articles
ప్రమాదకరంగా నూతనంగా నిర్మిస్తున్న మల్లంపల్లి బ్రిడ్జి
ములుగు జిల్లా మల్లంపల్లి బ్రిడ్జ్ ప్రమాదస్థితికి చేరకుంది. నిర్మాణం పూర్తికాకముందే మల్లంపల్లి బ్రిడ్జి కుంగిపోయే స్థితిలో ఉంది. మొదటి వర్షానికే బ్రిడ్జి అంచున పోసిన మట్టి కొట్టుకుపోయింది. మేడారం జాతర ముందు మొదలుపెట్టిన...
- Advertisement -
- Advertisement -


