33.2 C
Hyderabad
Wednesday, May 6, 2026
spot_img

యువగళం ముగింపు సభలో రెడ్ బుక్ తో కనిపించిన లోకేష్

         టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ బాబు రెడ్‌ బుక్‌ బెదిరింపుల కేసు నేడు ఏసీబీ కోర్టులో విచారణకు రానుం ది. ఈ కేసులో కోర్టు ఆదేశాలానుసారం సీఐడీ, లోకేష్‌కు నోటీసులు పంపారు. దీంతో ఇవాళ ఆయన కోర్టుకు హాజరవుతా రా? లేదా? అనేది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. పోలిపల్లిలో జరిగిన యువగళం ముగింపు సభలో రెడ్ బుక్ తో కనిపిం చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతల్ని, కార్యకర్తల్ని వేధించిన వారి పేర్లను ఇందులో రాస్తున్నానని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారి సంగతి తేలుస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన సీఐడీ..లోకేష్ కు నోటీసులు జారీ చేసింది. గత నెలలో ఏసీబీ కోర్టులో సీఐడీ ఒక మెమో దాఖలు చేసింది. లోకేష్‌కి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేయాలని కోరుతూ.. ఆధారాలతో సహా పిటిషన్‌లో సీఐడీ కోరింది. దీంతో తమ ముందు హాజరై స్వయంగా హాజరైగానీ లేదంటే న్యాయవాది ద్వారాగానీ వివరణ ఇవ్వాలని కోర్టు లోకేష్‌ను ఆదేశించింది.

Latest Articles

కవిత టార్గెట్ అన్న కేటీఆరేనా?

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబ పోరు ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. కొత్త పార్టీ పెట్టిన కవితను ఏమాత్రం పట్టించుకోవద్దని, ఎవరెవరో వస్తుంటారు పోతుంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ కేడర్‌కు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్