28.7 C
Hyderabad
Thursday, May 14, 2026
spot_img

ఆనం వెంకట రమణారెడ్డిపై దాడిని ఖండిస్తున్నాం: యనమల

స్వతంత్ర, వెబ్ డెస్క్: టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి దుర్మార్గమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వైసీపీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతున్నారన్న కక్షతోనే దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. జగన్ రెడ్డి అండతో రాష్ట్రంలో వైసీపీ మూకలు రెచ్చిపోతున్నాయని.. పట్టపగలు ప్రతిపక్ష నాయకులపై దాడులకు పాల్పడడం జగన్ రెడ్డి రౌడీ పాలనకు నిదర్శనమని తెలిపారు. ఇలాంటి దాడులతో మమ్మల్ని భయపెట్టాలనుకోవడం జగన్ రెడ్డి పగటి కల మాత్రమే అవుతుందని పేర్కొన్నారు. మాపై ఎన్ని దాడులు చేసినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో కొట్లాడుతామని స్పష్టం చేశారు.. ఆనంపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని యనమల డిమాండ్ చేశారు.


 

 

Latest Articles

అక్కినేని అభిమానులకు.. ఇక పండగే..

అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య, అఖిల్.. షూటింగ్లో బిజీగా ఉన్నారు. క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే.. అఖిల్ సినిమా లెనిన్ పై క్లారిటీ వచ్చింది కానీ.. నాగార్జున,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్