కేంద్ర క్యాబినెట్లో బీసీ కులగణనకు జీవో జారీ చేయడంపై మాజీ ఎంపీ వీ హనుమంతరావు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అంబర్పేటలో అలీ కేఫ్ చౌరస్తా వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలవేసి నివాళులర్పించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ బీసీ వాడినని చెప్పడమే తప్ప చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. జీవో నంబర్ 18 విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి కులగనను చేపట్టాలని ఆదేశాలు ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రతిపక్షాలు దీనిపై నోరు ఎత్తకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే బీసీ కులగణనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
బీసీ కులగణనకు జీవో జారీ చేయడంపై వీహెచ్ హర్షం
0
198
Previous article
Latest Articles
లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్
ఐపీఎల్ 2026 సీజన్లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్ జెయిట్స్ జట్టు కెప్టెన్ నుంచి రిషబ్ పంత్ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా...
- Advertisement -
- Advertisement -


