లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నామినేషన్ల దాఖలు జోరందుకున్నాయి. మరోవైపు ప్రచారంతో అభ్యర్థులు హోరెత్తిస్తున్నారు. మళ్లీ మోదీని ప్రధాని చేయాలనే లక్ష్యంతో కమలనాథులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా అగ్రనేతలను రంగంలోకి దింపారు. ఇవాళ బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేటలో జరిగే బహిరంగ సభకు ఆయన హాజరవుతారు. సిద్దిపేట డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు కమల నాథులు. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, రఘునందన్ రావు పాల్గొంటారు.