హైదరాబాద్ ఐపీఎల్ ఫ్యాన్స్ కల నెరవేరబోతోంది. ఇవాళ ఉప్పల్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ తలపడనున్నాయి. ఈ సీజన్ చివరి మ్యాచ్లో ఓడిన ఇరు జట్లు… ఈ మ్యాచ్లో గెలిచేందుకు పోటీకి సిద్ధమయ్యాయి. టికెట్లు ఆన్లైన్లో పెట్టిన రెండు గంటల్లోనే అయిపోయా యంటే ఈ మ్యాచ్కు ఉన్న క్రేజ్ తెలుస్తోంది. ప్యాట్ కమిన్స్ సారధ్యంలో హైదరాబాద్, రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగనున్నాయి. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠతో క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.