తెలంగాణ పీసీసీ చీఫ్ ఎన్నికపై అధిష్టానం కసరత్తు చేస్తోంది. పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి పదవీకాలం ఇవాళ్టితో ముగియడంతో కొత్త తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిపై కసరత్తు చేస్తోంది హైకమాండ్. దీంతో ముఖ్యనేతలంతా హిస్తనలో మకాం వేశారు. ఆశావాహులు ఢిల్లీకి క్యూ కట్టారు. పార్లమెంట్ హాల్లో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని మహేష్కుమార్ గౌడ్, మధుయాష్కీ కలిశారు ముఖ్య నేత లంతా అందుబాటులో ఉండాలని ఇప్పటికే ఏఐసీసీ ఆదేశించింది.మణుగూరు పర్యటన రద్దు చేసుకుని ఢిల్లీ బయల్దేరారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాత్రి 8 గంటలకు ముఖ్య నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి, ఇంచార్జ్ దీపాదాస్ మున్షి భేటీ కానున్నారు.


