స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. గ్రూప్ 1 పరీక్షను మరోసారి నిర్వహించాలని డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించిన డివిజన్ బెంచ్.. తదుపరి గ్రూప్ వన్ పరీక్షను నిర్వహించే సమయంలో ఖచ్చితంగా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించింది. ప్రిలిమ్స్ రద్దుపై ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ప్రిలిమ్స్ ను మళ్లీ నిర్వహించాలని టీఎస్ పీఎస్సీని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. టీఎస్ పీఎస్సీ సరిగా రూల్స్ పాటించలేదని, పరీక్ష కూడా సరిగా నిర్వహించలేదని చెప్పింది.