వేసవి సెలవుల అనంతరం ఏపీలో ఇవాళ్టి నుంచి పాఠశాలలు ప్రారంభయ్యాయి. విద్యార్థులకు స్కూల్ కిట్లను పంపిణీ చేయనున్నారు. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు పంపిణీ చేసే స్కూల్ కిట్పై మాజీ సీఎం జగన్ ఫోటో ఉన్నా పంపిణీ చేయాలని సూచిం చారు. ప్రభుత్వ ధనం వృధా కాకుండా చూడాలని ఆదేశించారు.
రాష్ట్రంలో నిన్న కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా చంద్రబాబు, మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ్టి నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్నాయి. విద్యార్థులకు ఇవాళ్టి నుంచి స్కూల్ కిట్లు పంపిణీ చేయాల్సి ఉంది. గత ప్రభుత్వంలో తయారు చేసిన స్కూల్ కిట్లపై జగన్ ఫోటో ప్రచురించి ఉంది. నిన్ననే కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం. కిట్లపై మాజీ సీఎం ఫోటో ఉండడంతో ఏం చేయాలన్న దానిపై అధికారులు తర్జనభర్జన పడ్డారు. ఈ క్రమంలో జగన్ ఫోటో ఉన్నా స్కూల్ కిట్లు పంపిణీ చేయా లని ఆదేశించారు.